జీకేవీధి: గుమ్మిరేవులలో పొలం పిలుస్తోంది కార్యక్రమం

81చూసినవారు
జీకేవీధి: గుమ్మిరేవులలో పొలం పిలుస్తోంది కార్యక్రమం
జీకేవీధి మండలం గుమ్మిరేవులలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి మధుసూధనరావు రైతులకు సలహాలు, సూచనలు అందించారు. మేలైన వరి వంగడాలను ప్రభుత్వం అందిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ప్రాంతీయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వెంకటేష్ బాబు పంటలకు వచ్చే తెగుళ్లు వాటి నివారణ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కమలమ్మ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్