వంతెన వద్ద రహదారి మరమ్మతులు

54చూసినవారు
వంతెన వద్ద రహదారి మరమ్మతులు
కొయ్యూరు మండలం రామరాజుపాలెం వంతెన వద్ద కొట్టుకుపోయిన రహదారి మరమ్మత్తు పనులు జాతీయ రహదారి నిర్మాణ సిబ్బంది మంగళవారం చేపట్టారు. రెండు రోజుల క్రితం మండల వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు కొండవాగులు ఉప్పొంగి ఉదృతంగా ప్రవహించాయి. మండలంలోని రామరాజుపాలెం, పెదమాకవరం, నడింపాలెం గ్రామాల మధ్యన గల కొండ వాగులపై జాతీయ రహదారి నిర్మాణ పనులలో భాగంగా పాత వంతెనలు తొలగించి తాత్కాలిక వంతెనలు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్