విశాఖ రైల్వే స్టేషన్లో నో పార్కింగ్ ఏరియాలో వాహనాలు నిలిపిన వారిపై కేసులు నమోదు చేశారు. ఈమేరకు బుధవారం ఆర్పీఎఫ్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అనధికార పార్కింగ్పై 60కి పైగా కేసులు నమోదయ్యాయి. ప్రజలు తమ వాహనాలను నో-పార్కింగ్ జోన్ల వద్ద పార్క్ చేయకూడదని, ఇది క్రౌడ్ మేనేజ్మెంట్కు అసౌకర్యాన్ని కలిగిస్తుందన్నారు.