ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి టీడీపీ నేతలు బస్సుల్లో విజయవాడకు బయలుదేరి వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం రాంనగర్ లోని టీడీపీ కార్యాలయం నుంచి బస్సులను దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి సీతంరాజు సుధాకర్ ప్రారంభించారు. తెలుగు తమ్ముళ్లతో పాటు జనసేన, బిజెపి కార్యకర్తలు కూడా విజయవాడకు బయలుదేరి వెళ్లారు.