టీడీపీలోకి చేరిన వైసీపీ కార్యకర్తలు
అచ్చుతాపురం మండలం దొప్పర్ల శివారు కొత్తగరవుకు చెందిన మాజీ పిఎసిఎస్ డైరెక్టర్ సీఎం అప్పారావుతో పాటు పలువురు శనివారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎంపి పప్పల చలపతిరావు సమక్షంలో చేరారు. వారందరికీ పార్టీ కండువాలువేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక టీడీపీలో చేరుతున్నట్లు తెలపారు. వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలుపునకు కృషి చేస్తామన్నారు.