సీఎం జగన్పై జరిగిన దాడి ఓ బూటకమని ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. కాళ్ల మండలం పెదమిరంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాజకీయాల్లో ఇలాంటి దాడులు ఉండకూడదనేదే అందరి మాట. నా మాటా అదే. అయితే. జగన్పై జరిగిన దాడిలో నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. సరిగా ఆ టైంలో లైట్స్ ఆఫ్ కావడం. ఛానల్ లైవ్ కూడా లేకపోవడం. అంతలోనే రాయి తగలడం. ఇవన్ని చూస్తే అదిఓ బూటకమని నాకు అనిపిస్తోంది’ అని అన్నారు.