దెందులూరు: చింతమనేని దృష్టికి ప్రజా సమస్యలు

76చూసినవారు
దెందులూరు: చింతమనేని దృష్టికి ప్రజా సమస్యలు
ప్రజా సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో ఆదివారం పలు గ్రామాలకు చెందిన ప్రజలు ఆయణ్ను కలిసి సమస్యలపై అర్జీలు అందించారు. అనంతరం వారి సమస్యలకు సంబంధించి వినతి పత్రాలు సేకరించిన ఎమ్మెల్యే వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పలువురు స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్