బంగారం దుకాణంలో చోరీ సీసీ ఫుటేజ్

84చూసినవారు
మొగల్తూరు మండలం కేపీపాలెంలో ఇటీవల భారీ దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షాప్ యజమాని శనివారం రాత్రి దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం వచ్చి చూసేసరికి వెనుక వైపున గోడకు రంధ్రం చేసి దుండగులు లోపలికి చొరబడి సుమారు రూ. 40 లక్షల విలువైన ఆభరణాలు చోరీ చేశారు. దొంగ ముసుకు వేసుకుని సీసీ కెమెరాలు నిలిపివేసిన వీడియో సోమవారం బయటకు వచ్చింది.

సంబంధిత పోస్ట్