వినాయక చవితి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలందరిని వినాయకుడు చల్లగా చూడాలని, ఎలాంటి విఘ్నాలు రాకుండా మంచి ఆరోగ్యంతో సంతోషం సంపదలతో కళకళలాడాలని గణనాథుడిని కోరుకున్నట్లు తెలిపారు.