టీడీపీ , జనసేన, బీజేపీ పార్టీల తరపున కాగుపాడు గ్రామంలో టిడిపి సీనియర్ నేత కడియాల రవిశంకర్ ఆధ్వర్యంలో గ్రామ తెలుగుదేశం ఆడపడుచులు ఇంటింటికి బుధవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఉంగుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మరాజు కు గ్లాసు గుర్తుకు, ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ కు సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఇంటింటికి వెళ్లి కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.