అఖండ జ్యోతి వెలిగించి.. ఓటర్లకు విజ్ఞప్తి
ఏలూరు జిల్లాలో ఉన్న 16. 37 లక్షల ఓటర్లను మే 13వ తేదీన ఓటు వేయమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ శనివారం వినూత్న రీతిలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నగరంలోని సెయింట్ థెరీసా మహిళా డిగ్రీ కళాశాలలో దీపాలు వెలిగించి జిల్లా యంత్రంగం విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ప్రతి ఒక్కరు ఈ నెల 13న ఓటు హక్కు వేయాలని కోరారు.