వైసీపీలో పలువురు చేరికలు
పెనుమంట్ర మండల జడ్పీటీసీ గౌరీ సుభాషిణి, మార్టేరు సర్పంచ్ మట్టా కుమారి ఆధ్వర్యంలో సోమవారం మార్టేరు మరియు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన 100మంది శెట్టిబలిజ మహిళలు వైస్సార్సీపీ లో చేరారు. ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు సమక్షంలో పార్టీ లో చేరిన మహిళలు, పార్టీకి వెన్నంటి ఉంటామని ఎమ్మెల్యే కు సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమం లో వేణుబాబు, మట్టా రాము, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు