అస్సాంలోని నాగోన్ జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. కలియాబోర్ పట్టణంలోని ఓ ఇంటి బాత్రూమ్లో 30కి పైగా పాము పిల్లలు ఉన్నాయి. దీంతో ఇంట్లోని వారు ఆందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ సంజీబ్ దేకాకు సమాచారం అందించారు. ఆయన ఆ పాములను బంధించి నిర్మానుష్య ప్రాంతంలో వదిలేశాడు. దీంతో ఆ ఇంట్లోని వారంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.