దక్షిణాదిలో ఎండలు మండిపోతుంటే ఉత్తరాది రాష్ట్రాల్లో విపరీతంగా మంచు కురుస్తోంది. ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, జమ్ము కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో నిరంతరం మంచు కురుస్తోంది. తాజాగా చమోలి, రుద్రప్రయాగ్, పిథోగఢ్ జిల్లాల్లో సముద్ర మట్టానికి 3 వేల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాలకు అధికారులు అవలాంచ్ హెచ్చరికలు చేశారు. రాబోయే 24 గంటల్లో ఇక్కడ మంచు చరియలు విరిగిపడే ప్రమాదం ఉందని తెలిపారు.