TG: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఫార్మా విలేజ్ ఏర్పాటుకు గత సంవత్సరం మార్చిలో ఏర్పాట్లు మొదలయ్యాయి. దుద్యాల మండలంలోని భూములను అధికారులు పరిశీలించారు. దీంతో రైతులు తమ భూములను గుంజుకోవద్దని, ఫార్మా కంపెనీలు కట్టొద్దని కోరుతూ తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. తమ భూములు ఇచ్చేదిలేదని బాధిత రైతులు నెలల తరబడి దీక్షలు చేస్తూ, నిరసన వ్యక్తం చేశారు.