తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీలను కేంద్ర కేబినెట్లో తీసుకోవాలని మోదీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్లను తన టీంలోకి తీసుకోవాలని అనుకున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై ఆ నేతలకు కూడా సమాచారం అందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.