తమిళనాడు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఖాతా తెరవకపోయినా.. ఓటు షేర్ను మాత్రం పెంచుకుంది. ఇక్కడ మరింత బలపడాలనుకుంటున్న బీజేపీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైకి కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తోంది. గతంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా పని చేసిన ఎల్. మురుగన్కు కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. అదే విధంగా అన్నామలైకు మంత్రి పదవి ఇవ్వొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.