AP: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు మరో షాక్ తగిలింది. విజయనగరంలో దువ్వాడపై కొప్పుల వెలమ వెల్ఫేర్, డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ రవికుమార్ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. పవన్కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని దువ్వాడపై ఫిర్యాదు పేర్కొన్నారు. తక్షణమే దువ్వాడ శ్రీనివాస్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రవికుమార్ పోలీసులను కోరారు. కాగా, ఇప్పటికే ఉమ్మడికృష్ణా జిల్లాలో ఆయనపై పలు కేసు నమోదు అయ్యాయి.