పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లును కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగంలోని నిబంధనలను ఉల్లంఘిస్తోందంటూ ఆయనదాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ పేర్కొన్న వేళ ఎంపీ మహ్మద్ జావేద్ పిటిషన్ దాఖలు చేయడం ఆసక్తిని సంతరించుకుంది.