మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ

69చూసినవారు
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
భారత సైన్యం మానవత్వం చాటుకుంది. ఆపదలో ఉన్న ఓ గర్భిణికి సకాలంలో చికిత్స అందించి ఆమె ప్రాణాలను కాపాడింది. జమ్మూ-కశ్మీర్‌లోని కుప్వాడా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ఓ పల్లెకు చెందిన గర్భిణి ఆరోగ్యం విషమించింది. ఈ విషయం తెలుసుకున్న గుగల్ధార్‌ బెటాలియన్‌ రంగంలోకి దిగింది. జుమాగుండ్‌లోని ఆర్మీ యూనిట్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌, పీకే గలిలోని బెటాలియన్‌ వైద్యాధికారి, గ్రామస్థుల సాయంతో కాలినడకన వేరే ప్రాంతానికి సురక్షితంగా తరలించి చికిత్స అందించారు.

సంబంధిత పోస్ట్