భద్రాచలంలో ఇకపై వారికి నేరుగా దర్శనం

83చూసినవారు
భద్రాచలంలో ఇకపై వారికి నేరుగా దర్శనం
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీరామచంద్రస్వామి దర్శనాలకు ఈఓ కొత్త విధానాలను ప్రవేశపెట్టారు. ఇకపై 60ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లులు, వారికి సాయంగా వచ్చేవారు నేరుగా దర్శించుకోవచ్చు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నప్పుడు బేడా మండపంలో వేచి ఉండేందుకు వీరికి సదుపాయాలు కల్పిస్తారు. ప్రొటోకాల్ అర్హత ఉన్నవారి కోసమూ ఏర్పాట్లు చేశారు. ఆలయ ఆఫీసులో వివరాలు అందించి కోరుకున్న దర్శనం, పూజ చేయించుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్