స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. ఇవాళ కూడా లాభాల్లోనే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ట్రేడింగ్ను మొదలుపెట్టింది. ఉదయం 9.21 సమయంలో నిఫ్టీ 66 పాయింట్లు పెరిగి 23.715 వద్ద, సెన్సెక్స్ 208 పాయింట్లు ఎగసి 78,192 సమీపంలో ట్రేడవుతున్నాయి. ఇక రూపాయి మారకం విలువ కొంచెం పుంజుకొని రూ.85.59 వద్ద మొదలైంది.