లోక్‌సభ ముందుకు ఆర్థిక సర్వే

68చూసినవారు
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఆర్థిక సర్వే 2024-25ను ఇవాళ ప్రవేశపెట్టారు. అనంతరం సభను స్పీకర్ ఓంబిర్లా రేపటికి వాయిదా వేశారు. శనివారం నిర్మల లోక్‌సభ‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. తొలుత 1950-51 సంవత్సరం నుంచి ఆర్థిక సర్వేను బడ్జెట్‌తో పాటే ప్రవేశపెట్టేవారు. 1960 తర్వాత బడ్జెట్‌కు ఒక రోజు ముందు ప్రవేశపెట్టే సంప్రదాయం మొదలైంది.

సంబంధిత పోస్ట్