పశ్చిమ బెంగాల్లో లోక్సభ తొలి దశ ఎన్నికలు ఈ నెల 19న నిర్వహించనున్నారు. మొత్తం మూడు లోక్సభ నియోజకవర్గాలు.. జల్పాయిగురి(ఎస్సీ), కూచ్ బెహార్(ఎస్సీ), అలిపూర్దౌర్(ఎస్టీ)కు పోలింగ్ జరగనుంది. ఈ మూడు చోట్ల 37 మంది బరిలో ఉండగా, వీరిలో 10 మంది కోటీశ్వరులే. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు, టీఎంసీ,
బీజేపీ నుంచి ఇద్దరు చొప్పున, సీపీఐ(ఎం),
కాంగ్రెస్, ఆర్ఎస్పీ నుంచి ఒక్కొక్కరి చొప్పున కోటీశ్వరులు ఉన్నారు.