ఆరో తేదీ జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

634చూసినవారు
ఆరో తేదీ జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి గ్రామం లో డివైఎఫ్ఐ నాయకుడు హరీష్ నాయక్ ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గ్రామస్తులు మాట్లాడుతూ దాదాపు 30 మంది పెన్షన్ రావడం లేదని 50 మందికి రేషన్ కార్డు లేదని ఉపాధి హామీ పనులు చేస్తున్నా డబ్బులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరీష్ నాయక్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడా బడా వ్యాపారులకు కొమ్ము కాస్తున్నాయి కానీ పేదలకు మాత్రం పట్టించుకోవడంలేదని చెప్పారు. జూన్ 6వ తేదీన జరిగే ఆర్ డి ఓ ఆఫీస్ ముట్టడికి అందరూ తరలి వచ్చి ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలనుద్దేశించి కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు గౌతమ్ గ్రామస్తులు విష్ణు వెంకయ్య కలమ్మ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్