మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం
మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలంలోని లింగనవాయి గ్రామంలో సరోజమ్మ (55) అనారోగ్యంతో మృతి చెందారు. విషయాన్ని తెలుసుకున్న ఆయన నేరుగా వారి ఇంటికి వెళ్లి ఆమె భౌతిక ఖాయానికి పూలమాల వేశారు. ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కుటుంబానికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.