జనజాతర సభకు సర్వం సిద్ధం
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ జనజాతర సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తి చేసినట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. లక్షమందికి పైగా హాజరు కానున్నట్లు సమాచారం.