సచివాలయం వద్ద రోడ్డుపై నిలిచిన వాన నీరు
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. వీధులన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపోర్లడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్ర సచివాలయం వద్ద రోడ్డుపై భారీగా నీరు నిలిచాయి. వర్షాలపై సచివాలయం నుంచి అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు.