లోటస్ పాండ్ లోని ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి ముందు నిర్మాణం కూల్చివేత ఘటనలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ పై వేటు పడింది. ఆయనను జీఏడీ ( సాధారణ పరిపాలన విభాగం) కు అటచ్ చేస్తూ జీహెచ్ఎంసీ ఇంచార్జీ కమిషనర్ ఆమ్రపాలి ఆదివారం ఆదేశాలు ఇచ్చారు. అధికారులకు సమాచారం ఇవ్వకుండా జగన్ ఇంటి ముందు షెడ్లను కూల్చివేసినందుకు హేమంత్ పై చర్యలు తీసుకున్నారు.