తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు గురువారం సెలవులు ప్రకటించింది. ఈనెల 30వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు కొనసాగనున్నాయి. మళ్లీ జూన్ 1వ తేదీన కాలేజీలు తెరుచుకోనున్నాయి. ఈ సెలవులు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ ఇంటర్మీడియట్ కాలేజీలకు వర్తించనున్నాయి. ఇంటర్ బోర్డు ఆదేశాలను ఉల్లంఘించి కాలేజీలను నిర్వహించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.