చేపలు పట్టేందుకు వెళ్లి ఓ వ్యక్తి వాగులో పడి మృతిచెందిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సైదోని గడ్డ తండాలో జరిగింది. సైదోని గడ్డ గ్రామంలో ఉన్న ఓ వాగులో చేపలు పట్టేందుకు వెళ్లిన రూప్సింగ్(45)ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందాడు. మృతదేహం నీటి పై తేలడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలం చేరుకున్న పోలీసులు మృతదేహాని బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.