సికింద్రాబాద్ వైఎంసీఏ ఆధ్వర్యంలో ఏప్రిల్ 26 నుంచి మే 31 వరకు సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి, నటుడు బాబూమోహన్ తెలిపారు. మంగళవారం క్యాంప్ బ్రోచర్ను అధ్యక్షుడు జయకర్ డేనియల్తో కలిసి ఆవిష్కరించారు. స్పోర్ట్స్, ఆర్ట్స్, మ్యూజిక్ తదితర విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పిల్లలు మొబైల్కు బదులుగా క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని తల్లిదండ్రులకు సూచించారు.