షాద్ నగర్ బస్టాండ్ లో చోరీ

70చూసినవారు
షాద్ నగర్ బస్టాండ్ లో చోరీ
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బస్ స్టేషన్ లో సోమవారం భారీ చోరీ జరిగింది. ఓ మహిళ ప్రయాణికురాలు వద్ద నుండి గుర్తు తెలియని దొంగలు ఆమె పర్సును అపహరించారు. అందులో రెండు తులాల బంగారంతో పాటు 28 వేల రూపాయల నగదు తస్కరించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అటు పోలీసులకు ఇటు డిపో అధికారుల ఉదాసీనతపై ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్