సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ బృందాలు రోజు వారిగా నిర్వహిస్తున్న తనిఖీల్లో హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 14, 34, 61, 890 నగదుతో పాటు రూ. 21, 82, 485 ల విలువ గల ఇతర వస్తువులు, 20, 767. 52 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమీషనర్ రోనాల్ రోస్ తెలిపారు. అదే విధంగా 195 మందిపై కేసులు నమోదు చేయడంతో పాటు 192 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.