తోకకు సమస్య అని వస్తే, తలకాయనే తీసేస్తవా రేవంత్ రెడ్డి అని BRS నేత జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేటలో మాట్లాడుతూ.. HCU భూముల అంశంలో రేవంత్ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. 400 ఎకరాల పంచాయితీకి మొత్తం 2 వేల ఎకరాలను కొట్టేసే ప్లాన్ చేస్తున్నాడని ఆరోపించారు. పంచాయితీలో ఉన్న 400 ఎకరాలను అక్కడే ఉన్న హెచ్సీయూ కి వదిలేసి పోతే సమస్య ముగుస్తుందన్నారు. సీఎం లాజిక్ లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు.