ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఓ గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. గోరువెచ్చని నీరు తాగితే మన పొట్టకి సంబంధించిన కండరాల నొప్పులు దూరమవుతాయి. శరీరంలోని ట్యాక్సిన్స్ దూరమై ఉబ్బరం, కడుపునొప్పి, అసౌకర్యం వంటి కడుపు సంబంధిత సమస్యలు దూరమవుతాయి. గోరువెచ్చని నీరు ప్రేగు కదలికల్ని కంట్రోల్ చేసి, మలబద్ధకం సమస్యని దూరం చేస్తుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగితే శరీర బరువు కంట్రోల్ అవుతుంది.