ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలి.. ఎంపీడీవో

61చూసినవారు
ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలి.. ఎంపీడీవో
బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామంలోని నర్సరీని మంగళవారం ఎంపీడీవో బషీరుద్దీన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలన్నారు. నర్సరీలో పెరుగుతున్న మొక్కలపట్ల అలసత్వం వహించరాదని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రశాంతి, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్