బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలో మంగళవారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల కలెక్షన్ల సర్వేను పంచాయతీ అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీఓ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో పకడ్బందీగా భగీరథ కలెక్షన్లో సర్వేలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నవీన్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ షాబోద్దీన్, పంచాయతీ సిబ్బంది చాంద్ తదితరులు పాల్గొన్నారు