ఎల్లారెడ్డి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. లింగారెడ్డి పేట్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు విశ్వనాథం యోగాసనాలు వేసి విద్యార్థులకు ప్రదర్శించి, యోగా ప్రాముఖ్యతను చెప్పారు. అడివి లింగాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామ ప్రత్యేక అధికారి, ఎంపిఓ ఆతినారపు ప్రకాష్ ప్రార్థన వేళలో హాజరై విద్యార్థులచే యోగాసనాలను చేయించారు.