కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఎమ్యెల్యే తోట లక్మి కాంతారావు సమీక్షా సమావేశం నిర్వహించారు.
వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అధికారులు, డాక్టర్లు అందరూ సమన్వయంతో పని చేసుకుంటూ వ్యాధులను అరికట్టాలని సూచించారు.
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్నారు.