శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామానికి చెందిన అంబాల ఐలయ్య మొలంగూర్ శివారులోని ఓ రైస్ మిల్లు సమీపంలో ఆదివారం ఉదయం రోడ్డుపై నడుస్తూ వెళ్తున్నారు. ఈ క్రమంలో మొలంగూర్కు చెందిన ఓ వ్యక్తి బైకుతో ఐలయ్యను ఢీకొనగా తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.