ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

537చూసినవారు
ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
తిమ్మాపూర్ మండలం పొరండ్లకి చెందిన మామిడిపల్లి అనిల్ అదే గ్రామానికి చెందిన కోండ్ర అనిల్ కు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని, ఇందుకోసం రూ. 3. 30 లక్షలు వసూలు చేశాడు. ఉద్యోగం ఇప్పించకపోగా, తీసుకున్న డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితుడు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎల్ ఎండీ ఎస్సై చేరాలు తెలిపారు. అతడిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్