పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం గాయత్రీ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థుల వీడ్కోలు సంబరాలు నిర్వహించారు. ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్, కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇటీవల మారేడుగొండలో నిర్వహించిన ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపులో పాల్గొన్న 50మంది వలంటీర్లు, శాతవాహన యూనివర్సిటీ నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.