రామగుండం కార్పొరేషన్ పరిధి రాజీవ్ రహదారి సర్వీస్ రోడ్డు నిర్మాణానికి ఆటంకంగా శ్రీ నగర్ కాలనీ, ప్రశాంత్ నగర్ లలో ఉన్న సైన్ బోర్డులు, హోర్డింగ్ లు, విద్యుత్ స్తంభాలకు వేలాడదీసిన బోర్డులను, ఆక్రమణలను రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం తొలగించారు. రామగుండం నగర పాలక సంస్థ కమీషనర్ సిహెచ్ శ్రీకాంత్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీనివాసరావు ఆక్రమణల తొలగింపు పనులు పర్యవేక్షించారు.