రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
పాల్వంచ ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటోను కార్ ఢీ కొట్టిన ఘటనలో మంగళవారం ఒక విద్యార్థి మృతి చెందగా మరో అయిదుగురు విద్యార్థులు, ఆటో డ్రైవర్ గాయపడ్డారు. రచ్చ ఈశ్వర్ అనే విద్యార్థి మృతి చెందగా గాయపడిన వారిని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాల్వంచ ఆసుపత్రిలో క్షతగాత్రులను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పరామర్శించారు.