మానవ సేవే మాధవ సేవగా అభాగ్యులకు అన్నదానం

552చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయ కమిటీ సభ్యులు బుధవారం పలువురు దాతల సహాయ సహకారాలతో పట్టణంలోని అభాగ్యులకు, నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ. మానవ సేవే మాధవ సేవగ భావించి ప్రతి బుధవారం స్వామి వారి పేరు మీద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్