ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు

63చూసినవారు
తిరుమలాయపాలెం మండల కేంద్రంలో బుధవారం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా నాయకులు మండల కేంద్రంలో రాస్తారోకో చేపట్టి, అనంతరం మండల అధికారులకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందించారు. ఎస్సీ వర్గీకరణను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని మండల నాయకులు శ్రీను డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్