పాలేరు-నరసింహులగూడెం రహదారికి మరమ్మతులు

65చూసినవారు
భారీ వర్షాల కారణంగా పాలేరు నుండి నరసింహులగూడెం వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతింది. వరదల దాటికి రహదారిపై లోయలు ఏర్పడి వాహనాల రాకపోకలకు మూడు రోజుల పాటు అంతరాయం ఏర్పడింది. దీంతో 15 గ్రామ పంచాయతీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జెసిబి సహాయంతో మరమ్మతులు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించారు. దీంతో ఆ గ్రామ ప్రజలు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్