భారత
క్రికెట్ జట్టు గురువారం నుంచి ఆఫ్గనిస్థాన్తో
టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్
కోహ్లీ మరో 35 పరుగులు చేస్తే టీ20ల్లో12,000 పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్గా రికార్డు సృష్టించనున్నాడు. ఐపీఎల్ లీగ్స్, ఇంటర్నేషనల్ టీ20లు కలిపి అతడి ఖాతాలో ఇప్పటికే 11,965 పరుగులు ఉన్నాయి. ఆఫ్గన్తో జరిగే మ్యాచ్లో ఈ రికార్డు బద్దలుకొట్టే అవకాశం ఉంది.