మార్నింగ్ వాక్ లో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి గోడం నగేష్
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా అభ్యర్థి గోడం నగేష్ బుధవారం ఉదయం కాగజ్నగర్ పట్టణంలోని ఎస్పీఎం క్రీడా మైదానంలో వాకర్స్ తో కలిసి మార్నింగ్ వాక్ లో పాల్గొని కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీని గెలిపించాలని కోరారు. సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు, కొమురంభీం జిల్లా బీజేపి అధ్యక్షులు డా. కొత్తపల్లి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు సిందం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.